September 19, 2024

శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఎన్నిక

Spread the love

నోబుల్ టీచర్స్ అసోసియేషన్

శ్రీకాకుళం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

శ్రీకాకుళం జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం గౌరవ అధ్యక్షుడు టి.జగన్నాధం జిల్లా అధ్యక్షుడిగా సూర పాపారావు, ప్రధాన కార్యదర్శి సీపాన ముకుందరావు, ఆర్ధిక కార్యదర్శిగా వావిళ్ళ పల్లి రాజారావు , జిల్లా కార్య వర్గ సభ్యులు గా డి.జనార్ధన రావు,బోకర శ్రీనివాస రావు , బి.కిషోర్ కుమార్ , యస్.విశ్వనాధం, వి.విష్ణు మూర్తి, యన్ అప్పల నాయుడు మొదలగు వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శ్రీకాకుళం NTA సమావేశంలో రాష్ట్ర సహా అధ్యక్షుడు బి నరేంద్ర, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి హైమారావు, సూర పాపారావు, యం చిరంజీవులు నాయుడు, యస్ ముకుంద రావు,వి.రాజారావు తదితరులు హాజరయ్యారు.సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సమస్యలు చర్చించారు. జీతాలు 1 తేదీనే చెల్లించాలి, నూతన పి ఆర్ సి కి ముందు 30%ఐ ఆర్ ప్రకటించాలి. జీఓ 117 రద్దు చేయాలి.మునిసిపల్ విలీన జి ఓ 84 రద్దు చేయాలి, అక్రమ బదిలీలు రద్దు చేయాలి, అన్ని రకాల పెండింగ్ బకాయిలు చెల్లించాలి,EHS క్యాష్ లెస్ వైద్యం ఆన్ని కార్పొరేట్ వైద్యశాలల్లో చేయాలని డిమాండ్ చేశారు..

info@jayahoupadhyaya.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *